ప్రీమియర్ ద్వారా రుద్రమదేవి ట్రైలర్
ఫిబ్రవరి 28న విడుదల
మాములుగా ట్రైలర్ అంటే యూట్యూబ్ లో లేదా సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తారు. కానీ ‘రుద్రమదేవి’ చిత్ర ట్రైలర్ ను మాత్రం ప్రీమియర్ షో ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రీమియర్ ద్వారా కొంతమంది మాత్రమే ఈ ట్రైలర్ ను చూడగలరు.
తెలుగులో భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రెండు పెద్ద చిత్రాల్లో ‘రుద్రమదేవి’ చిత్రం ఒకటి. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియోల వల్ల అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ట్రైలర్ విడుదల కాస్త ఆలస్యం అవుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఈ నెల 28న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను ప్రీమియర్ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఈ ప్రీమియర్ షోకు ఎలా హాజరుకావాలనేది ఈరోజు సాయంత్రం ప్రకటించనున్నారు. స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’ షూటింగ్ గత ఏడాది డిసెంబర్ లోనే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించగా అల్లు అర్జున్ ‘గోనగన్నారెడ్డి’ పాత్రలో నటించాడు. ఇందులో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారగణం ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నెల చివర్లో ‘రుద్రమదేవి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: telugu wishesh
0 comments:
Post a Comment