నాగ్ మల్టీస్టారర్లో శృతిహాసన్..
టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్లో వంశీపైడిపల్లి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే చిత్రంలో నాగార్జున బిజీగా ఉంటే...‘కొంబన్’ అనే తమిళ సినిమాతో కార్తీ బిజీగా ఉన్నాడు. అలాగే శృతిహాసన్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మహేష్బాబు సరసన నటిస్తోంది. వీరు నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా చివరి దశ షూటింగ్లో ఉన్నాయి.
అంటే ఈ మల్టీస్టారర్ సినిమా కొద్ది రోజుల్లో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు.
Source: http://www.andhrajyothy.com/Artical.aspx?SID=72973&SupID=24
0 comments:
Post a Comment