బీచ్లో తాగి గొడవ చేసిన నిత్యమీనన్
నిత్యమీనన్... ఎంత పద్ధతైన పిల్ల. తెరపై నిండుగా నవ్వుతూ కనిపిస్తుంది. కళ్లతోనే కవ్విస్తుంది. మంచి పాత్ర పడితే.. అందులో విజృంభిస్తుంది. ఈ దశాబ్దపు సావిత్రి అనిపించుకొంది. అవార్డులతో పాటు ప్రేక్షకుల మనసుల్నీ గెలుచుకొంది. ఆమెలోనూ ఓ తింగరి పిల్ల ఉంది. ఆమెలోనూ ఆధునిక భావాలున్న ఈతరం ఆడపిల్ల ఉంది. కిక్ ఎక్కితే నిత్య కూడా రచ్చ రచ్చ చేస్తుంది. ఈ విషయం ఇటీవలే బయట పడింది.
నిత్యమీనన్ కథానాయికగా నటించిన చిత్రం మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరిగింది. విశాఖ బీచ్ అంటే నిత్యకి బాగా ఇష్టమట. అందుకే ఎక్కువ సమయం బీచ్లోనే గడిపేదట.
ఓరోజు అర్థరాత్రి ఒంటరిగా బీచ్కి వెళ్తానని గొడవ చేసిందట. యూనిట్ సభ్యులు కంగారు పడి `ఈ టైమ్ లో అదీ ఒంటరిగా బీచ్కి వెళ్లడం మంచిది కాదు` అని హితబోధ చేశారట. కానీ.. నిత్య పట్టించుకోలేదట. ఎందుకైనా మంచిదని శర్వానంద్ నిత్యకి తోడుగా వెళ్లాడట. బీచ్ లో రెండింటివరకూ నిత్య అల్లరి చేసిందట. అటువైపుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు నిత్యని చూసి ` ఈ టైమ్లో ఇక్కడ ఉండడం మంచిది కాదు.. వెళ్లిపోండి` అని సుతిమెత్తగా హెచ్చరించి పంపించేశారట.
ఆ సమయానికి నిత్యమీనన్ మందుకొట్టి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
పైకి కనిపించదు గానీ.. నిత్యలో ఇంత మేటరుందా..?? హతవిధీ...!!
http://www.teluguone.com/tmdb/news/Nithya-menon-hungama-in-beach-tl-41791c1.html
0 comments:
Post a Comment