Latest News
Tuesday 6 January 2015

ఒక్కరోక్కరు దూరమవుతున్నారు : చిరంజీవి

ఒక్కరోక్కరు దూరమవుతున్నారు : చిరంజీవి


సినిమా పరిశ్రమకి చెందిన కళాకారులు మృతి చెందటం పట్ల మాజీ కేంద్రమంత్రి , మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైరాగ్యంతో కూడిన ఆవేదన అయన మాటలలో వ్యక్తం అయ్యింది. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు ఒక్కొక్కరిగా మృతి చెందటం పై ఆవేదనతో స్పందించారు. ఈ ఏడాది ఆరంభంలోనే నటుడు ఆహుతి ప్రసాద్ మృతి చెందగా, సోమవారం సంభాషణల రచయిత గణేష్ పాత్రో కన్ను మూసిన విషయం తెలిసిందే.

ఆదివారం ఉదయం కాన్సర్ వ్యాధితో కన్ను మూసినా ఆహుతి ప్రసాద్ భౌతిక కాయాన్ని అయన సోమవారం నివాళ్ళు అర్పించారు. ‘ఏమిటో…..సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు ఒక్కొక్కరు దూరమవుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో బాధగా ఉనది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ మాట్లా రచయిత గణేష్ పాత్రో మరణం కూడా కలచివేసింది అని అన్నారు.



Source:http://www.andhravilas.net/te/okkarokkaru-dooramavuthunnaru-chiranjeevi-580782.html
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఒక్కరోక్కరు దూరమవుతున్నారు : చిరంజీవి Rating: 5 Reviewed By: DMM